జహీరాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్ బిచ్కుందలోని శ్రీ సద్గురు బసవలింగ సంస్థాన్ మఠం పీఠాధిపతి సోమాయప్ప స్వామిని గురువారం మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకొన్నారు. ఈ సందర్భంగా సోమాయప్పను గాలి అనిల్కుమార్ శాలువాతో సన్మానించారు. అనంతరం లోక్సభ ఎన్నికలపై జుక్కల్ మాజీ ఎమ్మెల్యే షిండే ఆధ్వర్యంలో చర్చించారు.