నిజాంసాగర్/ పిట్లం, మార్చి 9: పిట్లంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో 13న నిర్వహించే మంత్రి కేటీఆర్ బహిరంగ సభాస్థలిని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ గురువా రం రాత్రి పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని స్థానిక నాయకులకు సూచించారు. బీఆర్ఎస్ యువ నాయకుడు హరీశ్షిండే, జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, నాయకులు జగదీశ్, అన్నారం వెంకట్రాంరెడ్డి, ప్రతాప్రెడ్డి, విజయ్, జొన్న శ్రీనివాస్రెడ్డి, బాబూసింగ్ ఉన్నారు.
ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ..
నిజాంసాగర్, పిట్లం మండలాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను ఎస్పీ శ్రీనివాస్రెడ్డి పరిశీలించారు. జక్కాపూర్ గేటు వద్ద ఏర్పాటు చేసిన పైలాన్, గోర్గల్ గేటు సమీపంలో నిర్మించిన హెలిప్యాడ్ పనులను ఎస్పీ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పిట్లంలో మంత్రి బహిరంగ సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. బాన్సువాడ డీఎస్పీ జగన్నాథరెడ్డి, నిజాంసాగర్, పిట్లం ఎస్సైలు రాజు, విజయ్కొండ, పిట్లం జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అన్నారం వెంకట్రాంరెడ్డి, ప్రతాప్రెడ్డి, విజయ్, జొన్న శ్రీనివాస్రెడ్డి, జగదీశ్ ఉన్నారు.