నిజామాబాద్ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఈదురుగాలులతో వడగండ్ల వర్షం కురిసింది.
మధ్యాహ్నం వరకు ఎండగా ఉండగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఉరుములు మెరుపులతో మోస్తరు వర్షం పడింది.
బోధన్, యడపల్లి, భీమ్గల్, కోటగిరి, వర్ని, నవీపేట్, జక్రాన్పల్లి, ఆర్మూర్లో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
వర్షానికి కల్లాల్లో నిల్వ చేసి ధాన్యం తడిసి ముద్దయ్యింది. పంట పొలాల్లో వరద నీరు నిలిచింది. పంటలు చేతికొస్తున్న వేళ ఈదురుగాలులతో అకాల వర్షాలు కురవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరో ఐదు రోజులపాటు వివిధ వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి