బాన్సువాడ, మార్చి 22: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 24న బాన్సువాడకు రానున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఇఫ్తార్ విందులో పాల్గొంటారని పార్టీ నాయకుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
పట్టణంలోని పెద్ద మసీదు ఎదురుగా ఉన్న బక్రాన్ బీడీ కాంప్లెక్సులో సాయంత్రం 6 గంటలకు ఇఫ్తార్ విందు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముస్లింలు హాజరుకావాలని ఆయన కోరారు.