బాల్కొండ, జనవరి 26 : ప్రతి ఒక్కరూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి పనిచేయాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బాల్కొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం ద్వారా బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు ప్రజలకు కులమతాలకతీతంగా అందరికీ కూడా సమాన హక్కులు కల్పించినట్లు తెలిపారు. రాజ్యాంగ చట్రంలోకి కొన్ని రాజ్యాంగేతర శక్తులు దూరి ఆ స్ఫూర్తిని చెడగొడుతున్నాయని, ఇకనైనా వారి తీరు మార్చుకోవాలని సూచించారు.