బాన్సువాడ రూరల్, ఫిబ్రవరి 29: అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే కష్టపడి చదవాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశాయిపేట పరిధిలోని నర్సింగ్ కళాశాల అనుబంధ వసతి గృహాన్ని ఆయన గురువారం తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలపై కళాశాల ప్రిన్సిపాల్ను అడిగి తెలుసుకున్నారు.
కళాశాల నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడి వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. నర్సింగ్ విద్యకు మంచి డిమాండ్ ఉందని, ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని సూచించారు. ఆయన వెంట పీఏ భగవాన్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మొగులయ్య, మల్లేశ్ తదితరులు ఉన్నారు.