బాన్సువాడ టౌన్/ వర్ని/ నిజాంసాగర్, డిసెంబర్ 12: అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాసరెడ్డి ఘన విజయం సాధించారు. దీంతో నియోజకవర్గ నలుమూలల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు, అధికారులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. బాన్సువాడలోని ఆయన స్వగృహంలో మంగళవారం కలిసిన పలువురు ఆయనకు పుష్పగుచ్ఛాలను అందజేసి, శాలువాలు కప్పి సత్కరించారు.
మాజీ స్పీకర్ను కలిసిన వారిలో బాన్సువాడ ఆర్డీవో భుజంగరావు, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదర్ రాజు తదితరులు ఉన్నారు. అంతకు ముందు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎర్రాపహాడ్ గ్రామ మహిళలు స్పీకర్కు మంగళహారతులు పట్టారు. చెడుపై మంచి విజయం సాధించిందని వారు ఆనందం వ్యక్తంచేశారు. వర్ని మండలం పొట్టిగుట్టతండా జగదాంబ దేవి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో స్పీకర్ పోచారం పాల్గొన్నారు.