ఆర్మూర్, అక్టోబర్ 25: కాంగ్రెస్, బీజేపీ అభివృద్ధి నిరోధక పార్టీలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన మైనారిటీ యువకులు, నందిపేట్ మండలానికి చెందిన బీజేపీ నాయకులు బుధవారం బీఆర్ఎస్లో చేరారు. వారికి ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోని తన నివాసంలో ఎమ్మెల్యే జీవన్రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మూడోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. వారి మాయ మాటలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో నందిపేట మండల బీజేపీ నాయకుడు తాటికాయల సాగర్, అశోక్ ఉన్నారు.