నిజామాబాద్ : ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులకు తీవ్ర అన్యాచం చేస్తుందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బీజేపీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు.
టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ధాన్యం కొనుగోలు విషయంలో మోదీ ప్రభుత్వం అవలంభిస్తున్న తీరును ఎండగడుతూ ర్యాలీ నిర్వహించారు. రైతుల పై బీజేపీ ప్రభుత్వం చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకిస్తూ నల్ల చొక్కా ధరించి నిరసన చేపట్టారు.