హైదరాబాద్, ఆగస్ట్15 : పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి సోమవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు.
75 సంవత్సరాల స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఆయన ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రగతి భవన్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కేసీఆర్తో పాటు జీవన్ రెడ్డి పాల్గొన్నారు.