నందిపేట్, అక్టోబర్ 20 : రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది దివ్యాంగులే బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లని ఆర్మూర్ నియోజకవర్గ అభ్యర్థి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. థ్యాంక్యూ కేసీఆర్ సార్ అనే వివాదంతో మండల కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్హాల్లో శుక్రవారం నిర్వహించిన దివ్యాంగుల ‘ఆత్మీయ సమ్మేళనం’లో జీవన్రెడ్డి పాల్గొని మాట్లాడారు. దివ్యాంగులను సీఎం కేసీఆర్ తండ్రిలా కాపాడుతున్నారన్నారు. దివ్యాంగుల బాధలను గుర్తించి పింఛన్ను రూ.4016కు పెంచారన్నారు. పేదలు, దివ్యాంగులకు బాసటగా నిలబడడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో 2018, 2019లో దివ్యాంగుల సంక్షేమంలో అత్యుత్తమ రాష్ట్రంగా కేంద్రం గుర్తించి రెండుసార్లు అవార్డులు అందజేసిందని జీవన్రెడ్డి గుర్తు చేశారు. అన్ని కుటుంబాలకు మేలు చేకూర్చేలా సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో రూపొందించారన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఏనాడూ దివ్యాంగులను పట్టించుకోలేదని, మానవత్వం లేని కాంగ్రెస్, బీజేపీలకు అసలైన వైక ల్యం ఉందన్నారు. రాష్ట్రంలోని వికలాంగులంతా కారు, సారు కేసీఆర్ వైపే ఉన్నారన్నారు. ఏ రాజకీయ నేపథ్యం లేని తనను రెం డుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని..పదేండ్లుగా తాను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు మూడోసారి గెలిపించాలని కోరారు.