ఎల్లారెడ్డి రూరల్, నవంబర్ 30: ఆరోగ్య సమస్యలతో దవాఖానల చుట్టూ తిరుగుతూ రూ. వేలు, లక్షల్లో డబ్బులను ఖర్చుపెడుతున్న మధ్య, దిగువ తరగతి కుటుంబాలకు ప్రభుత్వం ఆసరాగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. బుధవారం ఎల్లారెడ్డిలోని క్యాంపు కా ర్యాలయంలో మండలంలోని తిమ్మాపూర్, రుద్రారం, తిమ్మారెడ్డి, జంగమాయిపల్లి, దావల్మల్కపల్లి, మీసన్పల్లి, వెల్లుట్ల, వెంకటాపూర్, జాన్కంపల్లి, బ్రాహ్మణ్పల్లి, అడ్విలింగాల్, సాతె ల్లి, సోమార్పేట్, హాజీపూర్ తండా, పోతులగడ్డతండా, సఫ్దల్పూర్, భిక్కనూర్, అన్నాసాగర్, కళ్యాణి, మత్తమాల, మల్లయ్యపల్లి గ్రామాలకు చెందిన బాధితులకు రూ.27, 99, 500 విలువ గల 89 సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశా రు.
ఇచ్చిన చెక్కులను వెంటనే బ్యాంకు ఖాతాలో వేసుకోవాలని ఆయన సూచించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జలంధర్రెడ్డి, జడ్పీటీసీ ఉషాగౌడ్, పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీశ్కుమార్, లక్ష్మాపూర్ సర్పంచ్ రవీందర్గౌడ్, నాయకులు భూంగారి రాము, శ్రావణ్కుమార్, ఎరుకల సాయిలు, శ్రీ ను, నునుగొండ శ్రీనివాస్, గంగారెడ్డి, అరవింద్గౌడ్, నాగం సాయిబాబా, మామిడి దామోదర్, జీవన్గౌడ్, పటేల్ సాయిలు, గంజి లక్ష్మీనారాయణ, చింతల శంకర్, ముజ్జు, మామిడి రవీందర్ పాల్గొన్నారు.