భిక్కనూరు/బిచ్కుంద, ఏప్రిల్ 18: రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జుక్కల్ ఎమ్మె ల్యే హన్మంత్ షిండే అన్నారు. దళారులను నమ్మిమోసపోవద్దన్నారు. భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, బిచ్కుంద మండలం పుల్కల్ సొసైటీ ఆధ్వర్యం లో వాజిద్నగర్లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను వారు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వమే కొంటుందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనబోమని చెప్పినా.. రైతుల మేలు కోరి సీఎం కేసీఆర్ ధాన్యం కొనాలని నిర్ణయించారన్నారు.
రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. కల్లాల్లో ధాన్యం ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా ధాన్యం ఎక్కువ వచ్చే గ్రామాల్లోనే మరిన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. రైతులను ఇబ్బంది పెడితే సహించేదిలేదన్నారు. బిచ్కుంద మండలం పుల్కల్ సొసైటీ ఆధ్వర్యంలో గుండెనెమ్లి, బండరెంజల్, వాజిద్నగర్, పుల్కల్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే షిండే తెలిపారు.
బస్వాపూర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్, సింగిల్ విండో చైర్మన్ కిష్టాగౌడ్, ఎంపీపీ గాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ యాదగిరి, జడ్పీటీసీ పద్మ, ఏఎంసీ చైర్మన్ భగవంత్రెడ్డి , వైస్ చైర్మన్ హన్మంత్రెడ్డి, సర్పంచ్ మంజుల, ఉప సర్పంచ్ భిక్షమయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, విండో వైస్ చైర్మన్ మద్ది స్వామి, ఏఎంసీ డైరెక్టర్ బుర్రి గోపాల్, సీఈవో మహేశ్వరి, ఏవో రాధారెడ్డి , సింగిల్ విండో డైరెక్టర్లు, తహసీల్దార్ ప్రేమ్కుమా ర్, ఎంపీడీవో అనంతరావు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, విండో చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. వాజిద్నగర్లో నిర్వహించిన కార్యక్రమంలో పుల్కల్ సొసైటీ చైర్మన్ రాంరెడ్డి, ఎంపీపీ అశోక్ పటేల్, వాజిద్నగర్ సర్పంచ్ అనూయ, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సిద్ధిరాం పటేల్, సొసైటీ డైరెక్టర్ శ్రీనివాస్, విండో కార్యదర్శి సాయిప్రకాశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రావు, రైతులు పాల్గొన్నారు.