డిచ్పల్లి/ జక్రాన్పల్లి/ ఇందల్వాయి, నవంబర్ 25 : కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇతర రాష్ర్టాల్లో చెల్లని హామీలను తెలంగాణలో ఇస్తున్నారని, అక్కడ చెల్లనివి.. ఇక్కడ చెల్లుతాయా అని బీఆర్ఎస్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు. 24 గంటల కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావాల్నా.. లేక 3 గంటలు కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాల్నా ప్రజలు ఆలోచించాలని కోరారు. డిచ్పల్లి మండలంలోని నక్కలగుట్ట తండా, గొల్లమాట్ తండా, నడిమితండా, ఖిల్లా డిచ్పల్లిలో, జక్రాన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి, మాదాపూర్, గన్యాతండా, సికింద్రాపూర్, బాబానగర్, కేశ్పల్లిలో, ఇందల్వాయి మండలకేంద్రంతోపాటు గంగారాం తండాలో ఆయన శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి ఆర్టీసీపై మాట్లాడారని.. ఆర్టీసీలో జీతం, టీఏలు, డీఏలు తీసుకోకుండా చైర్మన్గా పనిచేశానని, ఈ విషయం బస్సు కండక్టర్లు, డ్రైవర్లను అడిగితే చెబుతారని అన్నారు. గ్యారంటీ హామీలతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆరునెలల్లోనే పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. అక్కడి నాయకులు తెలంగాణలోకి వచ్చి గ్యారంటీ హామీలతో మోసం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని, ప్రజలు వారి మాటలు నమ్మొద్దని సూచించారు. మంచిప్ప రిజర్వాయర్ను రూరల్ నియోజకవర్గానికి వరప్రదాయినిగా చేద్దామనుకుని పనులను ప్రారంభిస్తే.. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రజలను అయోమయానికి గురిచేసి పనులు జరుగకుండా అడ్డుకున్నారని తెలిపారు. గత పాలకులు గ్రామాలు, అన్ని వర్గాల ప్రజలను విస్మరించి పాలన చేశారని, తెలంగాణ వచ్చిన తర్వాత ఏ గ్రామం చూసినా కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలుచేస్తున్నారని తెలిపారు. దళితబంధు పథకం నిరంతరం కొనసాగే ప్రక్రియ అని స్పష్టం చేశారు. నేటి నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ అవుతుందని చెప్పారు. రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసి రుణమాఫీ, రైతుబంధును నిలుపుదల చేయించాలని చూసినా వీలుకాలేదన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతు ఖాతాల్లో డబ్బు జమచేస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటేనన్నారు. బీడీ కార్మికులకు కటాఫ్ తేదీని ఎత్తివేస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే బీడీలు చేసే వారందరికీ పెన్షన్ అందజేస్తామన్నారు. రూరల్ నియోజకవర్గంలోని గ్రామాలు, తండాల్లో మిగిలిన కొద్దిపాటి పనులను అధికారంలోకి రాగానే పూర్తిచేస్తామని హామీఇచ్చారు.
గొల్లమాట్ తండాకు వచ్చిన బాజిరెడ్డి గిరిజనులతో కలిసి హోటల్లో చాయ్ తాగారు. ఆయా గ్రామాల్లో బాజిరెడ్డి గోవర్ధన్కు మహిళలు, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. డిచ్పల్లిలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో బీఆర్ఎస్ రూరల్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు దాసరి ఇందిరాలక్ష్మీనర్సయ్య, సర్పంచులు గడ్డం రాధాకిష్టారెడ్డి, సొసైటీ చైర్మన్ గజవాడ జైపాల్, ఉపసర్పంచ్ రవీందర్, ఖిల్లా రామాలయ చైర్మన్ మహేందర్రెడ్డి, శక్కరికొండ కృష్ణ, నల్లవెల్లి సాయిలు, పద్మారావు, గజవాడ రాములు, ప్రతాప్రెడ్డి, లొక్కిడి గిరి, సర్దార్, విఠల్ రాథోడ్, అంబర్సింగ్, ఫైజల్ పాషా, కో-ఆప్షన్ సభ్యులు నయీం, పవన్, సాయిలు, మోహన్రెడ్డి పాల్గొన్నారు.
జక్రాన్పల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో ఎంపీపీ కుంచాల విమలాజు, జడ్పీటీసీ తనూజా శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ ముస్కు తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నట్ట భోజన్న, మండల కో-ఆప్షన్ సభ్యుడు బుల్లెట్ అక్బర్ఖాన్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఢీకొండ శ్రీనివాస్, సర్పంచులు దావుల పోసాని సంతోష్, నూర్సింగ్ రాథోడ్, తలారి గంగామణీ గంగాధర్, కందుల చిన్నలింగన్న, మైదం మహేశ్వర్, ఒల్లపు నిహారికా ఈశ్వర్, ఎంపీటీసీలు అంకం లక్ష్మీప్రకాశ్, మున్నూరు గంగాధర్, మాజీ ఎంపీపీ మైదం రాజన్న, చిత్తం మహేశ్ తదితరులు పాల్గొన్నారు. ఇందల్వాయిలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ రమేశ్ నాయక్, జడ్పీటీసీ గడ్డం సుమనారవిరెడ్డి, వైస్ ఎంపీపీ భూసాని అంజయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దాసు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు లోలం సత్యనారాయణ, బీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి పులి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు శెట్టి బీరీశ్, ఎస్సీసెల్ కన్వీనర్ పాశంకుమార్, సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్రెడ్డి, ఆరెట్టి రఘు తదితరులు పాల్గొన్నారు.