ఖలీల్వాడి, నవంబర్ 28 : జిల్లా కేంద్రంలోని వెంగళ్రావు కాలనీలో పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణానికి అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. 1962 నుంచి ఇక్కడ ముదిరాజ్ కులస్తులు పూజలు నిర్వహిస్తున్నారని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా పెద్దమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
ముదిరాజ్ సంఘాల నిర్మాణానికి సీడీపీ నిధులు రూ. కోటీ 5 లక్షలు మంజూరు చేసినందుకు ముదిరాజ్ సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మేయర్ నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, వెల్డింగ్ నారాయణ, జాలిగం గోపాల్, కరాటే రమేశ్, సిర్ప రాజు, కామారెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.