ఖలీల్వాడి, నవంబర్ 24 : జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘానికి అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, ఆయన సోదరుడు టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఎన్నారై గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల గురువారం రూ.25 లక్షల 51వేల 116 విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారిని సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. సంఘ భవనానికి వారి తండ్రి పేరు బిగాల కృష్ణమూర్తి భవన్గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రూ. కోటిన్నరతో ఆర్యవైశ్య సంఘ భవనాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు. తమ తండ్రి విద్య, అన్నదానాలపై ఆసక్తి కనబర్చేవారని గుర్తుచేశారు.
ఆయన జ్ఞాపకార్థం మాక్లూర్లో అధునాతన శ్మశానవాటికను నిర్మించామని తెలిపారు. శ్మశానవాటిక సమస్యలను సంఘ పట్టణ అధ్యక్షుడు భూమా లింగం గుప్తా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. తమ తండ్రి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మహేశ్ బిగాల తెలిపారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి గజవాడ హన్మంత్రావు, కోశాధికారి కోవూరి జగన్ గుప్తా, నుడా డైరెక్టర్ మల్లేశ్గుప్తా, కార్పొరేటర్ ప్రభాకర్ గుప్తా, అర్వపల్లి పురుషోత్తం గుప్తా, మోటూరి దయానంద్ గుప్తా, కోలారాం గుప్తా, మాదాని శ్రీధర్, పల్తి రవి, ప్రవీణ్, చిదుర శ్రీను, సంపత్, ప్రభు, సంతోష్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.