డిచ్పల్లి, మార్చి 6: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతునేస్తం కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మె ల్యే డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి సూచించారు. రైతువేదికలకు వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థను అనుసంధానం చేస్తూ ‘రైతునేస్తం’ పేరిట సీఎం రేవంత్రెడ్డి బుధవారం వర్చువల్గా ప్రారంభించారు. మండలంలోని మెంట్రాజ్పల్లి రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మం తు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొని మాట్లాడారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వా రా ప్రతి మంగళ, శుక్రవారం నాడు నిష్ణాతులైన వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులను సంప్రదించి రైతులు తమ సమస్యలను పరిష్కరించుకునే వెసులుబాటు ఏర్పడిందన్నారు. వచ్చే వానకాలం నుంచి పంటల బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి వాజిద్ హుస్సేన్, పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు జగన్నాథచారి, ఏవో రాంబాబు, ఏఈవోలు పాల్గొన్నారు.