నందిపేట్, నవంబర్ 15: నియోజకవర్గంలో కేసీఆర్ సర్కారు హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని, మరింత అభివృద్ధి కోసం మళ్లీ తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి కోరారు. మండలంలోని ఉమ్మెడ గ్రామంలో బుధవారం ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించిన జీవన్రెడ్డి ఇంటింటికీ వెళ్లి మళ్లీ బీఆర్ఎస్కే పట్టం కట్టాలని, తనను మరోమారు గెలిపించాలని కోరారు. ఆయనకు ఉమ్మెడలో మహిళలు మంగళహారతులు, బోనాలు, యువకులు బైక్ ర్యాలీలతో ఘన స్వాగతం పలికారు. జై జీవనన్న, జై కేసీఆర్ నినాదాలతో ఉమ్మెడ గ్రామం దద్దరిల్లింది. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. గ్రామప్రగతి నివేదికను ప్రజల ముందు ఉంచారు. బీఆర్ఎస్ అంటే బడుగులు, రైతుల సంక్షేమం అని అన్నారు. కాంగ్రెస్ బీజేపీలది అవినీతి, అరాచకత్వం అని, ఆర్మూర్ గడ్డపై ఆపార్టీలకు చోటు లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఏనాడైనా ఈ గ్రామానికొచ్చారా అని ప్రశ్నించారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు తదితర సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయని అన్నారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో అభివృద్ధి మరింత ముందుకు సాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఆర్మూర్, నవంబర్15: నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి, సంక్షేమాన్ని గెలిపించాలని ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలం గగ్గుపల్లి గ్రామంలో బుధవారం రాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా ఆశీర్వాద యాత్రను నిర్వహించారు. గ్రామానికి చేరుకున్న జీవన్రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి జీవన్రెడ్డి ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో గగ్గుపల్లి సర్పంచ్ లీనా, ఎంపీటీసీ లిఖితా మహేశ్, మాజీ సర్పంచ్ రాస జగదీశ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నందిపేట్, నవంబర్ 15: మండలంలోని వెల్మల్లో ముదిరాజ్ తదితర కుల సంఘాల సభ్యులు బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతూ జీవన్రెడ్డికి తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారికి బీఆర్ఎస్ కండువా కప్పి ఆహ్వానించారు. చేరిన వారిలో బీజేపీ వార్డు మెంబర్ సాయినాథ్, అనుచరులు ఉన్నారు.