వేల్పూర్, ఏప్రిల్ 15: రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి శనివారం బిజీబిజీగా గడిపారు. వేల్పూర్ మండల కేంద్రంలోని తన నివాసంలో బాల్కొండ నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన వారి సమస్యలను తెలుసుకొన్నారు. సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్కు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని అన్నారు. పేదలకు మెరుగైన వైద్యం కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నదని తెలిపారు. పేదింటి కుటుంబాలకు ఆడబిడ్డ పెండ్లి కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేస్తోందన్నారు. నియోజకవర్గంలోని పార్టీ మండల కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
మీతో బాటు నేనూ పోరాడుతా: ‘హైవే బాధితుల’తో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
కమ్మర్పల్లి, ఏప్రిల్ 15: ‘కేంద్ర ప్రభుత్వం తల పెట్టిన బ్రౌన్ హైవే నిర్మాణంలో బాధితులైన మీతోపాటు నేను పోరాడతా’ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బ్రౌన్ హైవే నిర్మాణం కమ్మర్పల్లి పట్టణం మీదుగా కొనసాగుతున్నది. దీంతో రూ. లక్షల విలువ జేసే నివాస గృహాలు, భవనాలు, ఇండ్ల స్థలాలు, వ్యాపారాలు వందల సంఖ్యలో పూర్తిగా కోల్పోతామని శనివారం కమ్మర్పల్లికి వచ్చిన మంత్రి వేములకు బాధితులు వినతిపత్రం అందజేశారు. బ్రౌన్ హై వేతో తమ బతుకులు తల కిందులవుతాయని వాపోయారు. బాధితులతో కలిసి తాను కూడా పోరాడుతానని, అండగా ఉంటానని మంత్రి భరోసానిచ్చారు.