ఖలీల్వాడి, సెప్టెంబర్ 10: ప్రభుత్వ ఆశయానికనుగుణంగా ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర రోడ్లు-భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ చీఫ్ ఇంజినీర్ కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాలకు మెరుగైన రోడ్లు, కల్వర్టులు, వసతులు అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరణ చేసినట్లు తెలిపారు. ఫలితంగా కొత్తగా మరిన్ని ఖాళీలు ఏర్పడినట్లు చెప్పారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి చొరవ చూపాలని అధికారులకు సూచించారు. పీఆర్సీఈ కార్యాలయం ఏర్పాటుతో ఇకనుంచి హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం చీఫ్ ఇంజినీర్గా బాధ్యతలు చేపట్టిన జీ. సీతారాములు, అధికారులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, సీపీ సత్యనారాయణ, ఇంజినీర్ అధికారులు బావన్న, శంకర్, ప్రభాకర్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.