ంవేల్పూర్, సెప్టెంబర్ 9 : మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లోని వివిధ గ్రామాల కుల సంఘాల భవన నిర్మాణాలకు రూ.75 లక్షల నిధులు మంజూరయ్యాయి.ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్లోని క్యాంపు కార్యాలయంలో సంఘాల ప్రతినిధులకు శనివారం అందజేశారు. మోర్తాడ్ మండలం వడ్యాట్ గ్రామంలోని మల్లన్న ఆలయ ప్రహరీకి రూ.4.50లక్షలు, కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామంలోని ఎర్రగొల్ల యాదవ సంఘం – 1 ప్రహరీకి రూ.4.50లక్షలు, కుర్మ సంఘ భవనానికి రూ.5లక్షలు, దళిత మాదిగ సంఘానికి రూ.5లక్షలు, చౌట్పల్లి గ్రామంలో దళిత మాల సంఘానికి రూ.6లక్షలు,
కుమ్మరి సంఘానికి రూ.3లక్షలు, కుర్మ సంఘానికి రూ.6లక్షలు, హాసాకొత్తూర్లో గౌడ సంఘానికి రూ.5లక్షలు, యాదవ సంఘానికి రూ. 4.50లక్షలు, యాదవ పెద్దసంఘానికి రూ.6లక్షలు, వడ్డెర జాతీయ సైన్య సంఘానికి రూ.6లక్షలు, కోనాపూర్ గ్రామంలో గురడికాపు రెడ్డి సంఘానికి రూ. 7లక్షలు, నాగపూర్లో కుర్మ యాదవ సంఘ భవనానికి రూ.5లక్షల నిధులు మంజూరయ్యాయి. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్లు దేవేందర్, ఏలియా, మోర్తాడ్ ఎంపీపీ శివలింగ శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.