కమ్మర్పల్లి, మే 26 : అనారోగ్యం, ఆపదలో ఉన్న వారికి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అండగా నిలుస్తున్నారు. ఖరీదైన వైద్యం చేయించుకున్న వేలాది మంది పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయాన్ని మంజూరు చేయిస్తూ వారి ఇండ్ల వద్దకే వెళ్లి చెక్కులను అందజేయిస్తున్నారు. అత్యవసర చికిత్స, ప్రాణాపాయ పరిస్థితుల్లో భారీ ఖర్చుతో కూడిన వైద్యానికి ఎల్వోసీ మంజూరు చేయిస్తూ పెద్ద దిక్కుగా నిలుస్తున్నారు. ఆర్థిక సహాయం చేస్తూ ఆదుకుంటున్నారు. బాల్కొండ నియోజక వర్గంలో ప్రజలందరినీ రాజకీయాలకతీతంగా తన కుటుంబ సభ్యుల్లాగా చేరదీస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ‘నేనున్నా’ అంటూ భరోసా అందిస్తున్న మంత్రి వేముల మానవతా హృదయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
మోర్తాడ్ యువకుడికి అండగా..
మోర్తాడ్ మండలం సుంకెట్ గ్రామానికి చెందిన సంపత్ అనే యువకుడి చేతికి అత్యవసర శస్త్ర చికిత్స అవసరమైంది. హైదరాబాద్లో నిమ్స్లో సర్జరీ చేయించుకోవడానికి ఎల్వోసీ ఇచ్చి ఆదుకోవాలని మంత్రి వేములను కోరాడు. తక్షణం స్పందించిన మంత్రి.. సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.70 వేల ఎల్వోసీ మంజూరు చేసి బాధితుడికి శుక్రవారం అందజేశా రు. తనను ఆపదలో ఆదుకున్న మంత్రి వేముల మేలు మరువలేనని యువకుడు పేర్కొన్నా డు. ఈ సందర్భంగా మంత్రికి ధన్యవాదాలు తెలిపాడు.