భీమ్గల్, జూన్ 24: బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పరంపర కొనసాగుతున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలోని పిప్రి గ్రామంలో పర్యటించారు. పిప్రి నుంచి ముచ్కూర్ వరకు రూ.5కోట్లతో చేపట్టనున్న డబుల్ రోడ్డు పనులు, రూ. 3.2కోట్లతో తండా వద్ద పిప్రి నుంచి లోద్ది రామన్న టెంపుల్ వరకు ఫార్మేషన్ పనులు, గుడి వద్ద రూ.75లక్షలతో నిర్మించనున్న స్లాబ్ కల్వర్టు పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం లోద్ది రామన్న ఆలయం వద్ద ఉన్న ఆంజనేయ ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో శంకుస్థాపనలు చేయడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మహేశ్, జడ్పీటీసీ రవి, కమ్మర్పల్లి ఏఎంసీ చైర్మన్ గుణ్వీర్ రెడ్డి, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మొయిజ్, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు ముత్తెన్న, విండో చైర్మన్లు నర్సయ్య, వెంకటేశ్, సర్పంచ్ ప్రవీణ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సయ్య, రైతుబంధు సమి తి జిల్లా సభ్యుడు కన్నె సురేందర్, మండల కన్వీనర్ శర్మానాయక్, ఎంపీటీసీ స్వామి, నాయకులు జనార్దన్, రాజేశ్వర్ తదితరులుపాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో సరదాగా..
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి పిప్రికి వచ్చిన మంత్రి వేముల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం వారితో కలిసి ఫొటోలు దిగగా..విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.