అగ్రకుల ఆధిపత్యాన్ని, బానిసత్వాన్ని ధిక్కరించి బహుజనులను తొలిసారి రాజ్యాధికారం వైపు నడిపించిన ధీశాలి సర్దార్ సర్వాయి పాపన్న అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మోర్తాడ్లో ఏర్పాటు చేసిన పాపన్న విగ్రహాన్ని ఆయన శుక్రవారం ఆవిష్కరించారు.
-మోర్తాడ్, ఆగస్టు18
జక్రాన్పల్లి/ ధర్పల్లి/ ఇందల్వాయి/ ఖలీల్వాడి/ సిరికొండ/ కోటగిరి/కమ్మర్పల్లి/బాల్కొండ/ భీమ్గల్/ఏర్గట్ల/ శక్కర్నగర్/బోధన్రూలర్/నందిపేట్/ఆర్మూర్/ ఎడపల్లి/ నవీపేట/ మాక్లూర్, ఆగస్టు 18 : పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 373వ జయంతిని జిల్లాలోని పలు గ్రామాల్లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జక్రాన్పల్లిలో ప్రజాప్రతినిధులు సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ చంద్రకళా బాలకిషన్, ఎంపీటీసీలు గంగారెడ్డి, సతీశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నట్ట భోజన్న, మాజీ సర్పంచ్ నర్సారెడ్డి, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.
ధర్పల్లి మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ జయంతిని నిర్వహించారు. పోలీస్స్టేషన్ ఎదురుగా ఉన్న పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు. గౌడ సంఘం మండల అధ్యక్షుడు సురేందర్గౌడ్ మాట్లాడుతూ.. మహ్మదీయ పాలన జరిగిన ఆకృత్యాలపై పాపన్నగౌడ్ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో గౌడ కులస్తులు పాల్గొన్నారు.
ఇందల్వాయి మండలకేంద్రంతోపాటు గన్నారం కమాన్ వద్ద సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గౌడసంఘం జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో శ్రీనివాస్గౌడ్, నవీన్గౌడ్, శ్రీధర్గౌడ్, వివిధ గ్రామాల గౌడ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
జిల్లాకేంద్రంలోని పాపన్నగౌడ్ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు నరాల సుధాకర్, బుస్సా అంజనేయులు, దర్శనం దేవేందర్, శ్రీనివాస్గౌడ్, చెరుకు లక్ష్మణ్గౌడ్ పాల్గొన్నారు.
సిరికొండ మండలం పెద్దవాల్గోట్లో గౌడ సంఘం అధ్యక్షుడు సుదర్శన్ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పెంటాగౌడ్, భూమాగౌడ్, గంగాసాయాగౌడ్, గంగాగౌడ్, శ్రీకాంత్గౌడ్, వెంకాగౌడ్ పాల్గొన్నారు.
కోటగిరి గీత పారిశ్రామిక సహకార సంఘం భవనంలో సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. గౌడ సంఘం మండల ప్రధానకార్యదర్శి అంబటి గంగా ప్రసాద్గౌడ్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషిచేశారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గీత పనివారాల సంఘం రాష్ట్ర కార్యదర్శి విఠల్గౌడ్, గీత కార్మికులు పండరిగౌడ్ పాల్గొన్నారు.
కమ్మర్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను గౌడ సంఘాల సభ్యులు ఘనంగా నిర్వహించారు.
బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో గౌడ సంఘం నాయకులు సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
భీమ్గల్ పట్టణంలో కౌన్సిలర్ సతీశ్గౌడ్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించారు. జాగిర్యాల్, గోన్గొప్పుల గ్రామాల్లో గౌడ కులస్తులు నిర్వహించారు.
ఏర్గట్ల మండలంలోని తొర్తి, తాళ్లరాంపూర్లో గౌడ సంఘాల ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా మోకుదెబ్బ జెండాను ఆవిష్కరించారు. మోకుదెబ్బ మండల అధ్యక్షుడు నారాగౌడ్, సర్పంచ్ కుండ నవీన్, అమర్ గౌడ్, ఉప సర్పంచ్ తాహేర్ పాల్గొన్నారు.
బోధన్ పట్టణంలోని ఆచన్పల్లిలో, నందిపేట్, సాలూర, ఎడపల్లి, నవీపేట, ఆర్మూర్ ఆర్మూర్ మండలంలోని దేగాం, మంథని గ్రామాల్లో , మాక్లూర్ మండలంలోని చిక్లీ గ్రామంలో గౌడ సంఘాల ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ జయంతి నిర్వహించారు.