తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్యకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. వేల్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కామారెడ్డిలో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, నిజామాబాద్లో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, జడ్పీ చైర్మన్ విఠల్రావు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దొడ్డి కొమురయ్య చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా అధికారులు, బీసీ సంఘాల ప్రతినిధులు శివరాం, సిద్ధిరాములు, మోహన్రాజ్ పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని మంగళవారం నిర్వహించారు. ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ దొడ్డి కొమరయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆయన అడుగు జాడల్లో నడవాలని అన్నారు.
కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్కుమార్, దోమకొండ జడ్పీటీసీ తిర్మల్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కుర్మ సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి, పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమలో బాన్సువాడ కుర్మ సంఘం పాలకర్గం, కుర్మ కులస్తులు పాల్గొన్నారు. దోమకొండలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, యాదవ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని నిర్వహించారు.
భిక్కనూరులో కుర్మ చైతన్య సమితి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినిఖిల్ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని నిర్వహించారు. కుర్మ సంఘం పెద్దలు, కేవైసీ టీం సభ్యులు పాల్గొన్నారు. పెద్దమల్లారెడ్డి గ్రామ పంచాయతీ ఆధ్వర్యం లో అధికారికంగా దొడ్డి కొమురయ్య వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీరాజలింగం, సింగిల్ విండో చైర్మన్ రాజాగౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హన్మంత్రెడ్డి, ఎంపీటీసీ సాయాగౌడ్, నాయకులు సతీశ్రెడ్డి, కుర్మ సంఘం, పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు. రాజంపేట మండలం పొందుర్తిలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో కేవైసీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, కార్యదర్శి మల్లయ్య, సలహాదారుడు బాబు, సర్పంచ్ గంగాకిషన్, ఎంపీటీసీ బాల్రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.