ఖలీల్వాడీ, ఆగస్టు 15 : 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్గ్రౌండ్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్అండ్బీ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. స్వాతంత్య్రం కోసం జీవితాలను త్యాగం చేసిన వారిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన నాడు అనే క రంగాల్లో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నది. అలాంటి పరిస్థితుల నుంచి రాష్ర్టాన్ని ప్రజలను అభివృద్ధి పథం వైపు సీఎం కేసీఆర్ ముందుండి నడిపిస్తున్నారన్నారు. నేడు రాష్ట్రం వ్యవసాయ రంగం లో దేశంలోనే ఉన్నత స్థానానికి చేరింది. అలాగే సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేస్తూ దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉంది. ఈ సందర్భంగా జిల్లాలో సాధించిన ప్రగతి నివేదికను వివరించారు.
వానకాలం 2023లో ఇప్పటి వరకు అన్ని పంటలు కలుపుకొని 5,00,285 ఎకరాల్లో సాగవుతున్నా యి. అర్హత కలిగి ఉన్న కుటుంబానికి లక్ష రూపాయల వరకు మాఫీ చేయడం జరుగుతున్నది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 23,444 మంది రైతులకు రూ.44.65 కోట్లు మాఫీ చేశాం. వానకాలం 2023కు అవసరమైన ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచాం. జిల్లాలో మార్చి 2023లో కురిసిన అధిక వర్షాలకు 467.14 ఎకరాల్లో పంట నష్టపోయిన 371 రైతులకు రూ. 46.73 లక్షల పంట నష్టపరిహారం రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేశాం. ఏప్రిల్ 2023లో కురిసిన అధిక వర్షాలకు 9170.38 ఎకరాల్లో పంట నష్టపోయిన 8702 రైతులకు రూ.9.17 కోట్ల పంట నష్టపరిహారం మంజూరు చేశాం. 2023-24లో 4,600 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు, బిందుసేద్యం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించాం. ఇంతవరకు 1544 ఎకరాలకు పరిపాలనా ఆమోదం లభించింది. ఇప్పటివరకు 950 ఎకరాల్లో ఆయిల్పామ్ మొక్కలు నాటారు. ప్రస్తు తం జిల్లాలోని మొత్తం 362 ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 22,938 మంది సభ్యులు ఉన్నారు. 2022-23కు గాను 986 చెరువుల్లో 458.77 లక్షల చేప పిల్లలను వదిలాం. ఇందుకు గాను 460.76 లక్షలు వెచ్చించాం. రొయ్య పిల్లల విడుదలలో భాగంగా ఎస్సారెస్పీ రిజర్వాయర్ 26 చెరువుల్లో మొత్తం 82.25 లక్షల రొయ్య పిల్లలను వదిలాం. దీనికి 202.55 లక్షలు వెచ్చించాం.
జిల్లాలో మొదటి విడుతలో భాగంగా భాగంగా 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు 10,722 గొర్రెల యూనిట్లను అనగా 2,25,162 జీవాలను రూ.1,39,355 కోట్లతో లబ్ధిదారులకు పంపిణీ చేశాం. రెండో విడుతలో భాగంగా 8384 యూనిట్లను అనగా 1,75,064 జీవాలను రూ.146.72 కోట్లతో లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఇందులో భాగంగా 1880 లబ్ధిదారుల వాటా చెల్లించారు. వారిలో ఇప్పటివరకు 144 యూనిట్లు పంపిణీ చేశాం. ప్రజాపంపిణీ పథకం జిల్లాలో మొత్తం 4,02,463 ఆహార భద్రత కార్డుల ద్వారా 12,87,095 మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు. ప్రతినెలా సగటున 8,100 మెట్రిక్ టన్నుల ఉచిత బియ్యంను సరఫరా చేస్తున్నాం. వానకాలం 2023-24 సీజన్లో జిల్లాలోని 89 సహకార సంఘాల ద్వారా 22,316 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు సరఫరా చేశాం. ఇంకా 25.639 మెట్రిక్ టన్నుల ఎరువులను నిల్వ చేశాం. 2022-23 యాసంగి లో జిల్లాలో 10 శనగ కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.42.80 కోట్లు ఇచ్చాం. పల్లెప్రగతిలో భాగం గా ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యాయి. జిల్లాలో 2,58,245 మంది వివిధ రకాల పింఛన్దారులకు నెలవారి పింఛన్ రూ.2016లను చెల్లిస్తున్నాం. సీఎం కేసీఆర్ 19461 మంది దివ్యాంగులకు నెలవారి పింఛన్ జూలై నుంచి రూ.4016 పెంచి ఇచ్చాం. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పట్టణ ప్రగతి ద్వారా రూ.51.55 కోట్లు, సీఎం అస్సురెన్స్ నిధుల ద్వారా రూ.300 కోట్లు టీయూఎఫ్ఐడీసీ నిధులతో యూజీడీ పనులకు రూ.160 కోట్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ.149.65 కోట్లు, ఎస్డీఎఫ్ 2022-23 ద్వారా రూ.100 కోట్ల నిధులు, 15వ ఆర్థిక సంఘం రూ.36.77 కోట్లు, జీవో 65 ద్వారా 6.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం.
జిల్లాలో 9.057 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. బ్యాంకు లింకేజీ ద్వారా 2023-24 సంవత్సరానికి 420 స్వయం సహాయక సంఘాలకు రూ.3409.50 లక్షలు, వడ్డీ లేని రుణాలు ఇప్పించాం. బైపాస్ రోడ్డులో 40.75 కోట్లతో నిర్మించిన ఐటీ హబ్ను ప్రారంభించుకున్నాం. జిల్లాలోని అన్ని కేటగిరీల వినియోగదారులకు 24 గంటల విద్యుత్ సరఫరా అవుతున్నది. జిల్లాకు 15,295 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు కాగా వీటికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసి (12,733) ఇండ్లకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశాం. మిషన్ భగీరథతో జిల్లాలోని 805 ఆవాసాలకు 2 నీటిశుద్ధి కేంద్రాల నిర్మాణం చేపట్టి 3 పాత నీటిశుద్ధి కేంద్రాలు ఆధునీకరించాం. జిల్లాలో 1180 పాఠశాలల్లో 1,19,466 విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. కేసీఆర్ కిట్ పథకం కింద ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవించిన 64,378 మందికి 68 కోట్ల 21 లక్షల 68 వేలు అందజేశాం.
దళితబంధు పథకంలో మొదటి విడుత కింద ట్రాన్స్పోర్ట్ సెక్టార్, నాన్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ కింద 550 యూనిట్లకు గాను రూ.55.00 కోట్లతో యూనిట్లు నెలకొల్పారు. వెనుకబడిన తరగతుల కుల వృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయం కోసం 23,892 లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్నారు.
భవనాల కింద కలెక్టర్ అధికారుల నివాస గృహాలు రూ.13.22 కోట్లతో మంజూరు చేయబడినవి. బైపాస్ రోడ్డులో 8.55 కోట్లతో నిర్మించబడిన న్యాక్ భవనం ప్రారంభించుకున్నాం. ఆర్వోబీ పనులు కొనసాగుతున్నవి.
జిల్లాలో పీఎంజీఎస్వై సీఆర్ఆర్, ఎంఆర్ఆర్, ఎస్డీఎఫ్, టీఎస్పీ, ఎంజీఎన్ఆర్జీఎస్, ఎంఆర్ఆర్బీటీఆర్, ఎఫ్డీఆర్, పథకాల కింద 9741 అభివృద్ధి పనులకు 1232.76 కోట్లతో మంజూరు చేయగా 6707 పనులకు 625.17ల ఖర్చుతో పనులు పూర్తి చేస్తున్నాం.
జిల్లాలో 2014 నుంచి 2022 వరకు భారీ, మధ్యతరహా, చిన్న నీటి పారుదల, చెక్డ్యాంలు, చిన్న నీటి ఎత్తిపోతల పథకాల, పుష్కరఘాట్ల పనుల కోసం రూ.5217.39 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు రూ.3919.21 కోట్లు ఖర్చు చేశాం. మిషన్ కాకతీయ, మినీ ట్యాంక్బండ్, ఆర్ఆర్ఆర్ పనులు, చెక్డ్యామ్ల నిర్మాణం, సిద్ధాపూర్ రిజర్వాయర్, నిజాంసాగర్ ప్రాజెక్టు ఉప కాలువలు, ఎస్సారెస్పీ కింద జిల్లాలో జరిగిన పనులు, లక్ష్మీ కెనాల ఆధునీకరణ, రామడుగు ప్రాజెక్టు తూము మరమ్మతు, గట్టుపొడిచిన వాగు కెనాల్ తవ్వకానికి, కాళేశ్వరం ప్యాకేజీ పనులు నిధులు మంజూరు చేశాం.
అలాగే వివిధ లిఫ్ట్, ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసి అభివృద్ధి పరుస్తున్నామన్నారు. జిల్లా హరితహారంలో భాగంగా 2023-24 సంవత్సరానికి గాను 47.978 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం పెట్టుకోగా ఇప్పటి వరకు 33 లక్షల మొక్కలు నాటాం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద 48,625 మంది లబ్ధిదారులకు రూ.1,00,116 చొప్పున రూ.486కోట్ల 81 లక్ష లు అందజేశాం. జిల్లాలో 9 భారీ, మధ్యతరహా పరిశ్రమలు రూ.332.65కోట్ల పెట్టుబడితో స్థాపించబడినవి. వీటి ద్వారా 7,424 మందికి ఉపాధి కల్పించబడింది. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విలేకరులు , స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.