కామారెడ్డి,సెప్టెంబర్ 14 : దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యపాడి అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నిజామాబాద్ పర్యటనకు వెళ్తూ కామారెడ్డిలో ఆగిన ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ హయాంలో తొమ్మిదేండ్లలోనే ఎన్నో సంస్కరణలు చేపట్టారన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతులకు 24 గంటల విద్యుత్, సాగు నీరు అందుతుందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా శిథిలావస్థకు చేరిన చెరువులు పూర్వవైభవాన్ని సంతరించుకున్నాయని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కులవృత్తులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ వివిధ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు.
ముఖ్యం గా మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీపై చేపపిల్లలు, రొయ్యలు అందజేస్తున్నామన్నారు. దీంతో చెరువుల్లో మత్స్య సంపద పెరిగి మత్స్యకారులు ఆర్థిక పరిపుష్టి సాధించారన్నారు. ఇదే విధంగా నేతన్నలకు, గీత కార్మికులకు ఇలా అనేక కుల వృత్తులకు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయడం ఇక్కడి ప్రజల అదృష్టమ న్నారు. హైదరాబాద్కు దీటుగా కామారెడ్డి అభివృద్ధి చెందుతుండడంతో భూముల విలువ విపరీతంగా పెరిగిందన్నారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. బీజేపీ నాయకులు మతం పేరి ట రాజకీయాలు చేయడమే తప్ప ఏనాడూ కేంద్రం నుంచి నిధులు తెచ్చిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు తమకు ఒక అవకాశం ఇవ్వమని అంటున్నారని.. స్వాతంత్య్రం వచ్చిన తర్వా త 45 నుంచి 50 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ఏం అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య కోసం మన ఊరు-మన బడి, మన బస్తీ- మనబడి కింద రూ. 7,200 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని వివరించారు. కార్పొరేట్కు దీటుగా ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలు అందుతున్నాయన్నారు. అన్ని జిల్లాలో మెడికల్ కళాశాలలు రావ డం చాలా అదృష్టం అని అన్నారు. కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు కలెక్టర్ జితేశ్ పాటిల్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి సింహారావు, మత్స్య శాఖ అధికారి వరదారెడ్డి, డీఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, పాడి అభివృద్ధి మేనేజర్ శ్రీనివాస్, దేవేందర్,ప్రజాప్రతినిధులు మంత్రికి స్వాగ తం పలికారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నా యకుడు నిట్టు వేణుగోపాల్రావు, యాదవ సం ఘం జిల్లా అధ్యక్షుడు అర్కల ప్రభాకర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కుంబాల రవి యాదవ్, భూమేశ్ లక్ష్మీపతి పాల్గొన్నారు.