మంత్రి కేటీఆర్ బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని వర్ని మండలం సిద్దాపూర్లో మంత్రి పర్యటిస్తారు. రూ.119.41 కోట్లతో నిర్మించిన సిద్దాపూర్ రిజర్వాయర్ను మంత్రి ప్రారంభిస్తారు. మంత్రి కేటీఆర్తో కలిసి ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొంటారు.
రేపు ఉదయం 8.30కు బేగంపేటలోని సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి రోడ్డు మార్గం ద్వారా బేగంపేట్ ఎయిర్పోర్ట్కు మంత్రి చేరుకుంటారు. అక్కడ హెలికాప్టర్లో నిజామాబాద్కు బయలుదేరుతారు. సిద్దాపూర్ గ్రామంలో ఉదయం 10 గంటలకు చేరుకుంటారు. అక్కడ సిద్దాపూర్ రిజార్వయర్ను ఉదయం 10.30కు ప్రారంభిస్తారు. అనంతరం సిద్దాపూర్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత సిద్దాపూర్ గ్రామంలో నిర్వహించే పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30కు హెలికాప్టర్ ద్వారా బయలుదేరి బేగంపేటకు చేరుకుంటారు.