వేల్పూర్ : మండల కేంద్రంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లను సోమవారం రాష్ట్ర గృహ నిర్మాణ, రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు.ఇండ్ల నిర్మాణం పనులు చివరి దశకు చేరుకోవడంతో పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మిగులు పనులను తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మౌలిక సదుపాయాలను, సౌకర్యాల పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.కార్యక్రమంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ నోడల్ అధికారి సింహాచలం, హౌసింగ్, ఆర్అండ్బీ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, టిఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అనంతరం బాల్కొండ నియోజక వర్గంలోని వివిధ మండలాలకు రూ.1.80 కోట్ల వ్యయంతో నిర్మించే కుల సంఘ భవనాలకు ప్రొసీడింగ్లను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని కులాలు, మతాలు, వర్గాలు సమాజంలో సమానంగా జీవించాలన్న సీ.ఎం. కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు.