పిట్లం, నవంబర్ 28: మండలవాసులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి స్థానిక ప్రభుత్వ 30 పడకల దవాఖాన భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.8 కోట్ల నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే హన్మంత్ షిండే తెలిపారు. సోమవారం ఆయన పిట్లం ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. పిట్లం మండలకేంద్రంలో 30 పడకల దవాఖాన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.8 కోట్ల నిధులు మంజూరు చేసిందని, ఇందుకుసంబంధించిన పనులను డిసెంబర్ 3న రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభిస్తారని తెలిపారు.
భవన నిర్మాణంతో రోగులకు మెరుగైన వైద్య సేవలు, సౌకర్యాలు కల్పించగలుగుతామన్నారు. ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు విజయ్, జొన్న శ్రీనివాస్రెడ్డి, రహిమతుల్లా, నర్సాగౌడ్, వైద్యాధికారులు శివకుమార్, రోహిత్కుమార్, సిబ్బంది ఉన్నారు.