బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమక్షంలో 200 మంది బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం బీఆర్ఎస్లో చేరారు. ఆర్మూర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, జాజాల సురేందర్ సమక్షంలో పలువురు గులాబీ గూటికి చేరారు.
కామారెడ్డి/ఆర్మూర్/ఎల్లారెడ్డి రూరల్, అక్టోబర్ 24 : బీఆర్ఎస్లోకి వలసల వెల్లువ కొనసాగుతున్నది. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారు. దీనికి తోడు అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడుతున్న బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని కుల సంఘాలు, గ్రామాలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి.
కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ మండ లం అంబారీపేట్, గోపాల్పల్లి, ముత్యంపేట్ గ్రామాలకు చెందిన సుమారు 200 మంది బీజేపీ, కాంగ్రెస్ నుంచి ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి విప్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో అందరం కలిసి కేసీఆర్ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు గండ్ర మధుసూదన్ రావు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్ మండలం పిప్రి గ్రామానికి చెందిన మున్నూరు కాపు సంఘం యూత్ సభ్యులు 50 మంది సర్పంచ్ అసపురం శ్రీనివాస్రెడ్డి, సొసైటీ చైర్మన్ సోమహేమంత్రెడ్డి, వీడీసీ అధ్యక్షుడు భోజన్న ఆధ్వర్యంలో 50మంది యువకులు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అంకాపూర్ గ్రామంలోని ఎమ్మెల్యే నివాసంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని జీవన్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ గుండా లింగన్న, అల్లేమ్ నరేశ్, ఆకుల నవీన్, ఆకుల గంగారాం తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి మండలం భిక్నూర్ గ్రామానికి చెందిన 50 మంది యువకులు ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజా సంక్షేమ పథకాలతో తిరుగులేని విధంగా పాలన కొనసాగిస్తున్న బీఆర్ఎస్ను ప్రజలు మరొక్కసారి ఆశీర్వదించాలన్నారు. కార్యక్రమంలో బల్దియా చైర్మన్ కుడుముల సత్యనారాయణ, భిక్నూర్ ఉపసర్పంచ్ గోనె శ్రీకాంత్, పార్టీ మండల అధ్యక్షుడు జలంధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.