నమస్తే తెలంగాణ యంత్రాంగం, అక్టోబర్ 25 : అమృత కలశ యాత్రలో భాగంగా పలు గ్రామాల్లో మేరా మట్టి – మేరా దేశ్ ర్యాలీని బుధవారం నిర్వహించారు. ధర్పల్లిలో ఎంపీడీవో లక్ష్మణ్ ఆధ్వర్యంలో మండలంలోని అధికారులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీవో రాజేశ్, పంచాయతీ కార్యదర్శులు, వైద్యసిబ్బంది, ఐసీడీఎస్, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. జక్రాన్పల్లి మండలకేంద్రంలో ఎంపీడీవో బ్రహ్మానందం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. వివిధ గ్రామాల నుంచి మట్టి, బియ్యాన్ని సేకరించి జిల్లా యూత్ వెల్ఫేర్ అధికారి శైలికి పంపారు. కార్యక్రమంలో ఎంపీపీ కుంచాల విమలా రాజు, తహసీల్దార్ ఎంఏ.ఖలీం, గిర్దావర్ ప్రవీణ్, మండల పశు వైద్యాధికారిణి శిరీష, ఎంఈవో శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
డిచ్పల్లిలో అమృత్ కలశ యాత్రను ఎంపీడీవో గోపీబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎక్స్ సర్వీస్మెన్, బర్ధిపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి వసంత్రావును సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీవో శ్రీనివాస్గౌడ్, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు. వర్ని మండల కేంద్రంలో అధికారులు అమృత్ కలశ యాత్ర నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శులు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు ర్యాలీలో పాల్గొన్నారు. నిర్వహించారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు సేకరించిన సాగు భూముల వద్ద సేకరించిన మట్టిని, ధాన్యాన్ని అధికారులకు అందజేశారు. ఎంపీడీవో బషీరుద్దీన్, ఎంపీవో చందర్, వైద్యాధికారిణి ప్రసన్న పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్లో ఎంపీడీవో మల్లేశ్, ఎంపీవో మధురిమ ఆధ్వర్యంలో అమృత కలశ యాత్ర నిర్వహించారు. గుండారం గ్రామానికి చెందిన వారం గంగాధర్, గంగాధర్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి హీరాజాదవ్, సూపరింటెండెంట్ ప్రవీణ్రెడ్డి, ఏపీవో పద్మ, టీఏలు ప్రభాకర్రెడ్డి, హరీందర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ భాస్కర్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. చందూర్లో అమృత కలశ యాత్రను నిర్వహించి ఆర్మీ జవాన్లను సన్మానించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో నీలావతి, ఉప తహసీల్దార్ ఆసియా బేగం, అధికారులు పాల్గొన్నారు.
భీమ్గల్ పట్టణంలో ఎంపీడీవో లక్మ రాజేశ్వర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా 27 గ్రామాల నుంచి మట్టి, బియ్యం తీసుకువచ్చి రెండు కుండల్లో వాటిని ఉంచి ర్యాలీ నిర్వహించినట్లు ఎంపీడీవో తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, ఐకేపీ, ఎన్ఆర్ఈజీఎస్, రెవెన్యూ, ఐసీడీఎస్, విద్యాశాఖ, వెటర్నరీ, అగ్రికల్చర్ శాఖల సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు.
బాల్కొండ మండల కేంద్రంలో ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. తహసీల్దార్ కార్యాలయం, ఎస్హెచ్వో, ఏపీవో, టీఏలు, ఎఫ్ఏలు, మేట్స్, పంచాయతీ కార్యదర్శులు కారోబార్లు, ఐకేపీ ఏపీఎం, సీసీలు, ఏఈవోలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఏర్గట్ల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం నుంచి అధికారులు ర్యాలీ ప్రారంభించారు. అన్ని వీధుల్లో ర్యాలీ కొనసాగింది. మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో నుంచి సేకరించిన మట్టి, బియ్యాన్ని సేకరించి ఢిల్లీకి పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎయిర్ ఫోర్స్లో సేవలందించిన మాజీ సైనికుడు శ్రీరాముల రత్నయ్యను అధికారులు సన్మానించినట్లు ఎంపీడీవో కర్నె రాజేశ్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీవో శివచరణ్ తదితరులు పాల్గొన్నారు.
మాక్లూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జైక్రాంతి అధ్యక్షతన ర్యాలీ నిర్వహించారు. ముందుగా మాదాపూర్లో జీపీ కార్యదర్శులు, ఈజీఎస్ ఎఫ్ఏలు, టీఏలతో కలిసి కలషాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పీఆర్ఏఈ శ్రీనివాస్, ఈజీఎస్ ఏపీఎం ఓంకార్, జీపీ కార్యదర్శులు మోహన్, రాకేశ్, చంద్రశేఖర్, మహేశ్, సురేశ్, సుప్రియ, వినయ్, ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు పాల్గొన్నారు.
ఎడపల్లి మండల కేంద్రంలో ఎంపీడీవో గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం నుంచి మంగళ్పాడ్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో అధికారులు, అంగన్ వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.