నిజాంసాగర్, మార్చి 11: ‘ప్రత్యేక పాలన అస్తవ్యస్తం’ అంటూ నమస్తే తెలంగాణ దినపత్రికలో ఈనెల 11న ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట, ఆరేపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులకు డీఎల్పీవో నాగరాజు మెమోలు జారీ చేశారు. సోమవారం ఆయా గ్రామాలను డీఎల్పీవో నాగరాజు, ఎంపీడీవో గంగాధర్, ఎంపీవో అబ్బాగౌడ్, ఉపాధి హామీ ఏపీవో శ్రీనివాస్ సందర్శించారు.
మూలనపడిన ట్రాక్టర్లను పరిశీలించి మరమ్మతులకు ఆదేశించడంతో షోరూంలకు తరలించారు. నర్సరీలను పరిశీలించి వెంటనే మోటార్లకు మరమ్మతులు చేయించి మొక్కలను కాపాడాలని ఆదేశించారు. వారి వెంట పంచాయతీ కార్యదర్శులు అంబయ్య, సునీత, హరీశ్ ఉన్నారు.