హనుమకొండ చౌరస్తా : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పోలీసు శాఖ పరంగా అన్ని ఏర్పాట్లూ చేశారు. మహాజాతరలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఆరు వేల మంది పోలీసులు విధుల్లో ఉండనున్నారు. వాహనాల నియంత్రణకు 6వేల మంది పోలీసులు విధుల్లో ఉంటారు. ట్రాఫిక్ జోన్ను మొత్తం 20 సెక్టార్లుగా విభజించారు. వీటికి ముగ్గురు డీసీపీలు ఇన్చార్జిలుగా ఉంటారు. ప్రతి సెక్టార్కు ఒక అదనపు ఎస్పీ లేదా డీఎస్పీ ఇన్చార్జిగా ఉంటారు. 30 ద్విచక్ర వాహన బృందాలను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం గట్టమ్మ నుంచి పస్రా వరకు 320 సీసీ కెమెరాలు అమర్చారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పస్రా-మేడారం మధ్య అర కిలోమీటర్కు ఒక పోలీస్ ఔట్పోస్టు ఏర్పాటు చేశారు. భక్తులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. దారిమధ్యలో ఎక్కడపడితే అక్కడ వాహనాలను నిలుపవద్దని కోరారు. జాతరకు వచ్చే భక్తులు పోలీసులకు సహకరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి విజ్ఞప్తి చేశారు.