గ్లాస్గో : భారత బాక్సర్లు అంకుశ్, సచిన్ సివాచ్, సాక్షి చౌదరి కామన్వెల్త్ గేమ్స్లో క్వార్టర్స్ చేరారు. సోమవారం జరిగిన పురుషుల 60 కిలోల విభాగం ప్రిక్వార్టర్స్లో సచిన్ 4-1తో విలియమ్ హ్యువిట్ (ఇంగ్లండ్)ను ఓడించాడు. ఏకపక్షంగా సాగిన 80 కేజీల పోరులో అంకుశ్.. 5-0తో జన్ జాలన్ (అంటిగ్వా అండ్ బార్బుడా)ను చిత్తుచేశాడు.
మహిళల 51 కిలోల ప్రిక్వార్టర్స్లో సాక్షి చౌదరి 5-0తో లెథబొ మొడుకనెలె (బోట్స్వానా)పై అలవోక విజయంతో క్వార్టర్స్లో ప్రవేశించింది.