ఖలీల్వాడి, జనవరి 22: ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ ఫలితాలను అడిషనల్ డీఎంఈ, కళాశాల ప్రిన్సిపాల్ ఇందిద సోమవారం వెల్లడించారు. మొత్తం 120మంది విద్యార్థులకు 115 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. 95శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంపై హర్షం వ్యక్తంచేస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.