వేల్పూర్/ కంఠేశ్వర్/ కామారెడ్డి, ఏప్రిల్ 11: సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఫూలే చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక సమానత్వం కోసం ఎంతో కృషి చేశారని వేశారని పలువురు వక్తలు కొనియాడారు. కామారెడ్డిలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న ఫూలే విగ్రహానికి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట బీసీ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, సహాయ అధికారి యాదగిరి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి,కార్యదర్శి సాయిలు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా సమీకృత కార్యాలయంలో జ్యోతిబా ఫూలే చిత్రపటానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు పూలమాల వేసి నివాళులర్పించారు.
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలేనని మాజీ మంత్రి , ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి కొనియాడారు. వేల్పూర్లో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ మొండి అశోక్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ నగధర్, రేగుల్ల రాములు, దాసు, భోజన్నయాదవ్ తదితరులు పాల్గొన్నారు.