మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి-సాయిపల్లవి జంటగా ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. త్వరలో కోల్కతాలో షూటింగ్ మొదలుకానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని సాధ్యమైనంత తొందరలో పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారట మణిరత్నం. 40 రోజుల నాన్స్టాప్ షెడ్యూల్తో కోల్కతా, పుదుచ్చేరి వంటి ప్రదేశాల్లో షూటింగ్ను పూర్తి చేయాలని, నవంబర్లోగా సినిమాను రిలీజ్ చేయాలనే ప్లానింగ్లో మేకర్స్ ఉన్నట్లు తెలిసింది.
కథారీత్యా యాక్షన్ ఘట్టాలు, గ్రాఫిక్స్కు ఎలాంటి అవకాశం లేకపోవడంతో నలభైరోజుల షూటింగ్ సరిపోతుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారట. చాలాకాలం విరామం తర్వాత మణిరత్నం ప్రేమకథను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తుండటం మరో ఆకర్షణగా నిలుస్తున్నది.