నమస్తే తెలంగాణ, నెట్వర్క్, ఫిబ్రవరి 18: మహాశివరాత్రి సందర్భంగా శనివారం జిల్లాలోని ప్రముఖ శివాలయాలు శివ నామస్మరణతో మార్మోగింది. భక్తులు ఉదయం నుంచే వచ్చి పూజలు నిర్వహించారు.
బోధన్ పట్టణంలోని ప్రముఖ శివాలయంలో తెల్లవారుజామున 4 గంటల నుంచే వచ్చి భక్తులు పూజలు చేశారు. రాత్రి 9 గంటలకు శివ కల్యాణం కనులపండువుగా నిర్వహించారు. రాత్రి 12 గంటలకు నిశిపూజ చేశారు.
బోధన్ మండలంలోని అమ్దాపూర్, చిన్నమావంది, సాలూరా, పెంటకుర్దు తదితర గ్రామాల్లోని శివాలయాల్లో పూజలు నిర్వహించారు. ఆదివారం ప్రత్యేక పూజలతోపాటు అన్నదాన కార్యక్రమం కొనసాగనుంది.
రెంజల్ మండలంలోని కందకుర్తి గోదావరికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. త్రివేణి సంగమ క్షేత్రంలో భక్తులు ఉదయం నుంచే పుణ్య స్నానాలు ఆచరించారు. శివాలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి గ్రామంలో ఉన్న ఉమామహేశ్వర ఆలయంలో భక్తులు పూజలు నిర్వహించారు. నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి దంపతులు పూజలు నిర్వహించారు. వారిని ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు.
కమ్మర్పల్లి మండలంలోని ఉప్లూర్లో శ్రీ బాల రాజేశ్వర స్వామి జాతర ఘనంగా సాగింది. జిల్లాతోపాటు పొరుగు జిల్లాలు, ముంబై నుంచి భక్తులు వచ్చి పూజలు చేశారు. పట్టువెంట్రుకలు, కోడె దూడలు, తులాభారం వేయించి మొక్కులు చెల్లించుకున్నారు.
చౌట్పల్లిలో ఉమా పార్థీవ కోటి లింగేశ్వర స్వామి, కమ్మర్పల్లిలో శివాలయం, అమీర్నగర్లోని శివ గుట్ట ఆలయం, తదితర శివాలయాలు భక్తులతో కిట కిటలాడాయి. శివ పార్వతుల కల్యాణోత్సవాలు నిర్వహించారు.
మెండోరా మండల పోచంపాడ్లో గోదావరి తీరాన ఉన్న శివాలయంలో శివపార్వతుల కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రభుత్వ లాంఛనాలతో పట్టువస్ర్తాలను అందించారు. ఆలయంలో భక్తులు హోమం, పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
ఏర్గట్ల మండల కేంద్రంలో నేరెళ్ల గురడిరెడ్డి సంఘం ఆధ్వర్యంలో హోమం, ప్రత్యేకపూజలు నిర్వహించారు. మండల కేంద్రంలోని శ్రీ బాల రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద స్థానిక ముదిరాజ్ సంఘ సభ్యులు పూజలు నిర్వహించారు. బట్టాపూర్, తడ్పాకల్ గ్రామాల్లో ఉన్న శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
ముప్కాల్ మండలం పడిలేచిన మర్రిచెట్టు వద్ద వెలసిన శివలింగేశ్వర స్వామి ఆలయంలో శివ కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆదివారం మహా అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తారు.
మోర్తాడ్ మండలంలోని శివాలయాలకు భక్తులు బారులుతీరారు. ధర్మోరా, శెట్పల్లి గ్రామాల్లో జాతర కొనసాగింది. తిమ్మాపూర్లో భక్తులకు ఆలయకమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వడ్యాట్, మోర్తాడ్, ధర్మోరా, శెట్పల్లి గ్రామాల్లో ఆదివారం భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాయి.
భీమ్గల్ మండల కేంద్రంలోని నందీశ్వరాలయంలో శివలింగానికి మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలతా సురేందర్ దంపతులు అభిషేకం చేశారు. వేదపండితులు శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో భక్తులు నడిచారు.
బాల్కొండలోని స్వయంభూ శివలింగ క్షేత్రంలో భక్తులు పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు.
నందిపేట్ మండలం కేదారేశ్వర ఆశ్రమం, నందికేశ్వర ఆలయం, ఉమ్మెడ ఉమామహేశ్వర ఆలయం, అయిలాపూర్ శివాలయంలో భక్తులు బారులు తీరి శివలింగాన్ని దర్శించుకుని అభిషేకం, అర్చనలు చేశారు. కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకుడు మంగిరాములు మహారాజ్ ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం నిర్వహించనున్న అన్నదానం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.
ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సిద్ధ్దులగుట్టపై ఉన్న శివాలయంలో భక్తులు పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆశన్నగారి రాజేశ్వర్రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినితా పవన్ కుటుంబ సమేతంగా పూజలు చేశారు.
మాక్లూర్ మండల కేంద్రంలో శ్రీవీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయంలోని శివలింగాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం ఆలయం వద్ద అన్నదానం చేస్తామని వీడీసీ సభ్యులు తెలిపారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలోని శివాలయంలో భక్తులు పూజలు నిర్వహించారు. నవీపేట మండలంలోభక్తులు పూజలు చేశారు. ఏండ్ల చరిత్ర కలిగిన నాళేశ్వర్ శివాలయం భక్తులతో కిటకిటలాడింది. మండల కేంద్రంలో లింగం గుట్టలో స్వయంభూ ఆలయంలో సిద్దేశ్వర మహరాజ్ ప్రత్యేక పూజలు చేశారు. జన్నేపల్లి, యంచ, ఫకిరాబాద్, నవీపేట భక్త మార్కేండేయ ఆలయాల్లో భక్తులు నిర్వహించారు.
ముప్కాల్ మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లోని శివాలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు.