డిచ్పల్లి, జనవరి 24 : నిజామాబాద్ నగర శివారులోని మాధవనగర్ రైల్వే గేటును నేటి నుంచి నెల రోజులపాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతున్న దృష్ట్యా పనులకు ఆటంకం కలుగకుండా గేటును మూసివేస్తున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు. నగర ప్రయాణికులు బైపాస్ మీదుగా, డిచ్పల్లి మండలవాసులు ముల్లంగి, కులాస్పూర్ మీదుగా వెళ్లాలని సూచించారు.