Dog Attack | సిరికొండ, మార్చి 27 : పిచ్చికుక్క దాడిలో పలువురు గాయాలపాలైన ఘటన సిరికొండ మండలంలో ని చిమన్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పిచ్చికుక్క వీధిలో తిరుగుతూ కనబడిన వారిపై దాడి చేసి గాయపరిచింది. ఈ ఘటనలో రాయికంటి లింబాద్రి, కట్కం ప్రసాద్, నిషాన్ తో పాటు ఇంటి బయట ఆడుకుంటున్న ఏనుగు సిద్ధార్థ రెడ్డి అనే బాలుడిని గాయపరిచింది.
మాలధారణలో ఉన్న లింబాద్రి చేతిపై గాయపరిచింది. హనుమాన్ మందిరం నుండి ఇంటికి వస్తున్న ప్రసాద్పై ఒక్కసారిగా దాడి చేసింది. కుక్క కాటుకు గురైన వారిని స్థానికులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సిద్ధార్థ రెడ్డిని వారం రోజుల పాటు ఆసుపత్రి లో ఉండాలని డాక్టర్లు సూచించారు.