రుద్రూర్ : లారీ, బస్సు ఢీకొన్న ఘటనలో డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని రుద్రూర్ – వర్ని ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రుద్రూర్లో ఎదురెదురుగా వస్తున్న బస్సు, లారీ ఢీకొన్నాయి.
ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు కాగా, సుమారు 20 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చి క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.