మోర్తాడ్, జూలై 19: కమ్మర్పల్లి అటవీరేంజ్ కార్యాలయంలో ఆదివారం చిరుత కళేబర అవశేషాలను దహనం చేశారు. భీమ్గల్ మండలం తాళ్లపల్లి అటవీప్రాంతంలో ఇటీవల కొందరు చిరుతపులిని హతమార్చారు.
చంపిన చిరుత పులిని పాతిపెట్టిన ప్రదేశం నుంచి తవ్వి కళేబర అవశేషాలను కమ్మర్పల్లి అటవీరేంజ్ కార్యాలయానికి ఈనెల 12న పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అదే రోజు పోస్టుమార్టం నిర్వహించి, చనిపోయింది చిరుతపులేనని నిర్ధారించారు. అటవీరేంజ్ కార్యాలయ ఆవరణలో అవశేషాలను ఆదివారం దహనం చేశారు.