నిజామాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో విస్తరించిన బాన్సువాడ నియోజకవర్గం యావత్ రా ష్ర్టానికి ఆదర్శమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సిద్ధాపూర్ రిజర్వాయర్, చందూర్ – జాకోరా ఎత్తిపోతల వంటి ప్రాజెక్టులతో బాన్సువా డ ప్రాంతం సమృద్ధిగా పంటలు పండించే ఏరియా గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో నిజాంసాగర్ నీటి కోసం గోస పడిన ప్రాంతానికి పుష్కలంగా సాగు నీటి వసతిని కల్పించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పనితనం గొప్పదని మంత్రి కేటీఆర్ అన్నారు. బాన్సువాడ ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని కొనియాడారు. రూ.119.41 కోట్లతో చేపట్టబోయే సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులకు పోచారం శ్రీనివాస రెడ్డి, మం త్రి వేముల ప్రశాంత్ రెడ్డిలతో కలిసి కేటీఆర్ బుధవారం శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్, ఎంపీ బీబీపాటిల్తో కలిసి సిద్ధాపూర్కు చేరుకున్న మంత్రి కేటీఆర్… ఓపెన్ టాప్ మినీ బస్సులో సిద్ధాపూర్ ప్రాంతంలో కలియ తిరిగారు. రిజర్వాయర్ నిర్మిస్తున్న ప్రాంతం వివరాలను పోచారం వివరించా రు. అటవీ ప్రాంతాన్ని చూసి ముగ్ధులైన మంత్రు లు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి రిజర్వాయర్ రూపుదిద్దుకున్న తర్వాత టూరిస్ట్ స్పాట్గా మార్చుకునే అవకాశం ఉందంటూ అభిప్రాయపడ్డారు.
శంకుస్థాపన తర్వాత అక్కడే నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. గిరిజన జనంతో పాటు కాయితీ లంబాడీలను చూ సి ఆనందించారు. వారి వేషధారణతోపాటు సిద్ధాపూర్ తండా చుట్టూ అటవీ ప్రాంతంలోని ప్రకృతి రమణీయతకు కేటీఆర్ ముగ్ధుయ్యారు. ప్రజలనుద్దేశించి దాదాపు అరగంట సేపు కీలక ఉపన్యాసం ఇచ్చారు. ఇందులో భారతీయ జనతా పార్టీ తీరును తూర్పార పట్టారు. సమైక్య పాలనలో ఇదే సిద్ధాపూర్ ప్రాంతంలో చెరువు అభివృద్ధి పనికి 25 ఏండ్ల క్రితం రూ.70లక్షల కోసం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎక్కని కొండ లేదు.. మొక్కని బండ లేదని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేశారన్నారు. రిజర్వాయర్ కోసం స్పీకర్ పడిన బాధ, తపన, వారి గుండెల్లో బాన్సువాడ ప్రజలపై ఉన్న ప్రేమ గొప్పదన్నారు. అలాంటి మహానుభావుడు మీకు శాసనసభ్యుడు కావడం బాన్సువాడ ప్రజల అదృష్టమంటూ కేటీఆర్ కితాబునిచ్చారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ కన్నా బాన్సువాడలోనే అత్యధికంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరయ్యాయన్నారు. 119 నియోజకవర్గాల్లో అత్యధికంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరైంది ముఖ్యమంత్రి నియోజకవర్గం కాదని కేటీఆర్ చెప్పారు. ఇంకా నాలుగైదు వేల ఇండ్లు మంజూరు చేయాలని పోచారం పట్టుపడుతున్నట్లు గుర్తు చేశారు.
బాన్సువాడ నియోజకవర్గ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ వరాలు ప్రకటించారు. సిద్ధాపూర్కు భవిష్యత్తులో టూరిజం కళను సంతరించుకునేలా చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా బా న్సువాడ మున్సిపాలిటీకి రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లుగా వెల్లడించారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు నిజాంసాగర్ నీళ్ల కోసం ఎన్నో పోరాటాలు, ధర్నాలు జరిగాయని కేటీఆర్ గుర్తు చేశారు. అధికారంలో ఉంటే ముఖ్యమంత్రితో బతిమిలాడి నీళ్లు తేవాల్సిన పరిస్థితి, ప్రతిపక్షంలో ఉంటే రోడ్డెక్కాల్సిన దుస్థితి ఉండేదన్నారు. పోచారం పటిమ, శక్తి వల్ల సిద్ధాపూర్కు రూ.120 కోట్లతో రిజర్వాయర్, కాలువలు మంజూరు కావడం,మరో ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూ.106 కోట్లు మంజూరు కా వడం స్వరాష్ట్రంలో సాధ్యమైందన్నారు. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ నాయకత్వంలో ఎక్కడో గోదావరి జలాలను సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎత్తు నుంచి 612 మీటర్ల ఎత్తుకు ఎత్తి పోయడం సాధారణ విషయం కాదన్నారు. ఆ నీళ్లను కొండపోచమ్మ సాగర్ నుంచి నిజాంసాగర్కు తెచ్చే ప్రయత్నంతో లక్ష ఎకరాల్లో 2 పంటలు సాగు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పుడు ని జాంసాగర్ కింద నాన్ కమాండ్ ఏరియాలో నీళ్లు రాని ప్రాంతాలను గుర్తించి రెండు ప్రాజెక్టులు చేసిన తర్వాత బాన్సువాడ అత్యధికంగా పంటలు పండించే నియోజకవర్గాల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు.
వర్ని మండలంలోని సిద్ధాపూర్ అటవీ ప్రాంతాన్ని ఏరియల్ వ్యూలో తిలకించిన మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. మూడు చెరువులు… ఐదు గుట్టల ప్రాంతాల్లో నిర్మిస్తున్న రిజర్వాయర్ మూలంగా భవిష్యత్తులో మంచి సుందరమైన ప్రకృతి రమణీయత సాక్షాత్కారం అవుతుందన్నారు. దీనికి తో డుగా ఈ ప్రాంతంలోని సహజ సిద్ధమైన ప్రకృతి అందాలను చూసి తాను ఫిదా అయినట్లుగా కేటీఆర్ తెలిపారు. తప్పకుండా ఈ ప్రాంతంలో కొంత టూరిజం ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తామన్నారు. గతంలో బాన్సువాడకు వచ్చినప్పుడు ఇక్కడ డ బుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిన తీరును చూసి సిరిసిల్ల కలెక్టర్కు టీమ్ను పంపి పరిశీలన చేయాల్సిందిగా ఆదేశాలిచ్చినట్లు గుర్తు చేశారు. బాన్సువాడలో రూ.300 కోట్లతో రహదారుల నిర్మాణం, రూ.20 కోట్లతో 100 పడకల మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి, ప్రతి మండలంలో ఒక గురుకుల పాఠశాల, బీఎస్సీ నర్సింగ్ కళాశాల మంజూరైందన్నారు. బాన్సువాడ పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చడమే కాకుండా రూ.100 కోట్లు నిధులివ్వడంతో రూపురేఖలు మారాయన్నారు.ఇలా అద్భుత కార్యక్రమాలు తెలంగాణ వచ్చినంక జరుగుతున్నాయన్నారు.
సభకు గిరిజన తండాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా సభా ప్రాంగణంలోనే ప్రత్యేకంగా రక్త దాన శిబిరాలను నిర్వహించడంపై పోచారం భాస్కర్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. బిజీ కార్యక్రమంలోనూ కేసీఆర్ పుట్టిన రోజు కార్యక్రమాన్ని నిర్వహించడంపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ శంకుస్థాపన కార్యక్రమం విజయవంతానికి డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పకడ్బందీ ప్రణాళికలను రూపొందించారు. స్పీకర్ సలహాలు, సూచనలతో పాటు ఇటు అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. రిజర్వాయర్ నిర్మాణాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.