ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొండా లక్ష్మణ్ బాపూజీకి గురువారం ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటాలను స్మరించుకుంటూ బాపూజీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
నిజాంసాగర్, సెప్టెంబర్ 21: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, నిబద్ధత కలిగిన రాజకీయవేత్త, బలహీన వర్గాలకు స్ఫూర్తి ప్రదాత కొండా లక్ష్మణ్ బాపూజీ అని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. బిచ్కుందలోని మార్కండేయ మందిరంలో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిలో ఆయన పాల్గొన్నారు.
ముందుగా బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ అశోక్ పటేల్, పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రావ్దేశాయ్, మార్కె ట్ కమిటీ చైర్మన్ నాగ్నాథ్పటేల్, ఎంపీటీసీ రాజు, యాదవ్రావు సహదేవ్, సంఘం అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, బాన్సువాడ డివిజన్ అధ్యక్షుడు రాజు, మండల అధ్యక్షుడు మాలేగాం పమమేశ్, హన్మాండ్లు నారాయణ, సుంకి లక్ష్మణ్, బాల్కిషన్, భూమయ్య, శంక ర్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.