కామారెడ్డి, మే 6 : లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు (మంగళవారం) కామారెడ్డి జిల్లా కేంద్రంలో రోడ్షో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జేపీఎన్ రోడ్డు వద్ద రోడ్షోకు సంబంధించిన ఏర్పాట్లు, సభాస్థలిని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సోమవారం పరిశీలించారు. రోడ్షోకు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆ సందర్భంగా గంప గోవర్ధన్ కోరారు. మాజీ విప్ వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ ఉన్నారు.