కామారెడ్డి, మే 2: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో త్వరలో పర్యటించనున్నారు. పట్టణంలోని జేపీఎన్ రోడ్డు వద్ద రోడ్షో నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో సభాస్థలిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జాజాల సురేందర్ గురువారం పరిశీలించారు. కేసీఆర్ రోడ్ షోకు బీఆర్ఎస్ కార్యకర్తలు,నాయకులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని వారు కోరారు. వారి వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, మాచారెడ్డి ఎంపీపీ నర్సింగరావు, జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్కుమార్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్రెడ్డి, గైని శ్రీనివాస్గౌడ్ ఉన్నారు.