మాచారెడ్డి మండలం సోమారంపేట్ గ్రామానికి చెందిన యువ రచయిత, భారత జాగృతి కామారెడ్డి జిల్లా సాహిత్య విభాగం కో -కన్వీనర్ కళ్లెం నవీన్ రెడ్డి రాసిన ‘యోధ’ కవితా సంపుటిని మాజీ సీఎం,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం రాత్రి హైదరాబాద్లో ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పోరాట పటిమ, తెలంగాణ తెచ్చిన నాయకుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదేండ్ల పాటు ప్రజల కోసం పనిచేసిన కేసీఆర్ నేపథ్యాన్ని నవీన్రెడ్డి పుస్తక రూపంలో తీసుకువచ్చారు.
కేసీఆర్ పోరాట స్ఫూర్తి, ఆయన ఆలోచనలను పుస్తకంలో సవివరంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నవీన్రెడ్డిని కేసీఆర్ అభినందించారు. మాజీ స్పీకర్ పోచారం, మాజీ మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి పాల్గొన్నారు.