కామారెడ్డి,అక్టోబర్ 5 : కామారెడ్డి జిల్లా కేంద్రానికి ఈ నెల 7వ తేదీన ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. స్థానిక కళాశాల మైదానంలో నిర్విహించనున్న నియోజకవర్గంలోని కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు. కేటీఆర్ రాక నేపథ్యంలో ఏర్పాట్లను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గురువారం పరిశీలించారు.
ఈ సమావేశానికి బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ప్రభుత్వ విప్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రభుత్వ విప్ వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, బీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, మాచారెడ్డి జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి, కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, మామిండ్ల అంజయ్య, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు.