కామారెడ్డి/ ఖలీల్వాడి, ఏప్రిల్ 11 : ఉమ్మడి జిల్లా లో కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది.18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేసుకోవాలని అవగాహన కల్పించడంతో శిబిరాలు సందడిగా మారుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో మంగళవారం 44 బృందాలతో 5235 మందికి పరీక్షలు నిర్వహించి 491 మందికి కళ్లద్దాలను పంపిణీ చేశారు.
ఇప్పటి వరకు మొత్తం 2,90,655 మందికి పరీక్షలు నిర్వహించగా.. 45,019 మందికి కళ్లద్దాలను పంపిణీ చేసినట్లు డీఎంహెచ్వో లక్ష్మణ్సింగ్ తెలిపారు.నిజామాబాద్ జిల్లాలో మంగళవారం 9,147 మందికి పరీక్షలు నిర్వహించి.. 707 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశా రు. ఇప్పటి వరకు 4,08,409 మందికి పరీక్షలు నిర్వహించగా 75,527 మందికి కళ్లద్దాలను అందజేసినట్లు డీఎంహెచ్వో సుదర్శన్ తెలిపారు.